📄 ePaper
Friday, February 20, 2026
📄 ePaper
HomeSports NewsCricketWomens Cricket World Cup 2025 | లేడీస్ క్రికెట్ వరల్డ్ కప్ 2025: భారత్...

Womens Cricket World Cup 2025 | లేడీస్ క్రికెట్ వరల్డ్ కప్ 2025: భారత్ మ్యాచ్ వర్షం ఆపేసింది – ఇంగ్లండ్ ఘన విజయం

2025 మహిళల ఐసీసీ వన్‌డే వరల్డ్ కప్‌లో ఇవాళ రెండు కీలక పోటీలు జరిగాయి. ఒకవైపు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగించగా, మరోవైపు ఇంగ్లండ్ మహిళల జట్టు న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.

Indian Vs Bangladesh |భారత్ vs బంగ్లాదేశ్: వర్షం ఆటను నిలిపేసింది : 

నవి ముంబైలోని డాక్టర్ డి.వై. పాటిల్ స్టేడియంలో జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. బంగ్లాదేశ్ జట్టు 27 ఓవర్ల పరిమితి మ్యాచ్‌లో 119/9 స్కోరు చేసింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రేణుకా సింగ్ మూడు వికెట్లు, దీప్తి శర్మ రెండు వికెట్లు తీసారు. భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించకముందే వర్షం మళ్లీ కురిసింది. మ్యాచ్ కొనసాగుతుందా లేదా అన్నది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంది. టీమ్ ఇండియా ఇప్పటికే సెమీఫైనల్ రేసులో ముందంజలో ఉంది, ఈ మ్యాచ్ గెలిస్తే టాప్‌ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ విజేత – న్యూజిలాండ్ కెప్టెన్ రిటైర్మెంట్ : 

మరోవైపు, ఓక్లాండ్‌లో జరిగిన ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. Amy Jones అజేయంగా 86 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ తన 19 ఏళ్ల ODI కెరీర్‌ను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె నిర్ణయం అభిమానులను కదిలించింది.అయితే ఇంగ్లండ్ జట్టుకు కొంత ఆందోళన కూడా ఉంది — ప్రధాన స్పిన్నర్ సోఫీ ఎక్ల్‌స్టోన్ భుజ గాయం కారణంగా మైదానం వీడింది. ఆమె సెమీఫైనల్‌కు అందుబాటులో ఉంటారా అన్నది సందేహంగా మారింది.

ఇది కూడా చదవండి :  24k Gold Rate | మహిళలకు శుభవార్త... మళ్లీ తగ్గిన బంగారం ధర..!

 Match highlights | మ్యాచ్ హైలెట్స్ :

భారత్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచింది. వర్షం కారణంగా మ్యాస్ ను 27 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ 119/9 – భారత బౌలర్ల మెరుపు ప్రదర్శన చేశారు. ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్ల్‌స్టోన్ గాయపడ్డారు.

Next matches | తదుపరి పోటీలు : 

సెమీఫైనల్స్ వచ్చే వారం జరగనున్నాయి. వాతావరణం, ఆటగాళ్ల ఫిట్‌నెస్, పిచ్ పరిస్థితులు కీలక పాత్ర పోషించనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page