- హోరాహోరీగా సాగిన ఇచ్చోడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు
- బ్యాలెట్ పద్ధతిలో నూతన కార్యవర్గం ఎంపిక
- అధ్యక్షుడిగా కొత్తూరు లక్ష్మణ్ విజయం
వాస్తవ నేస్తం, ఇచ్చోడ: జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని ఇచ్చోడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, హోరాహోరీగా ముగిశాయి. అధ్యక్ష పదవి కోసం కొత్తూరు లక్ష్మణ్, అన్నేల లక్ష్మణ్, మేడపట్ల సాయన్న ముగ్గురూ పోటీ పడగా, సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక సభ్యుల మద్దతు పొందిన కొత్తూరు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు.

నూతన కార్యవర్గం వివరాలు:
- • అధ్యక్షుడు: కొత్తూరు లక్ష్మణ్
- • ఉపాధ్యక్షులు: సిరిగిరి శ్రీనివాస్, ఎం.ఎ. జాకీర్
- • ప్రధాన కార్యదర్శి: రాథోడ్ అజయ్
- • గౌరవ సలహాదారులు: నరాల రమణయ్య, మాధవ్, రవూఫ్ ఖాన్
ఈ సందర్భంగా ఎన్నికైన ప్రతినిధులు మాట్లాడుతూ… మండలంలోని జర్నలిస్టులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారి హక్కులు మరియు సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు తోటి పాత్రికేయులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
