వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల వరుసగా పెరిగిన ధరల నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు స్పాట్ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావం నేరుగా రిటైల్ మార్కెట్పై పడటంతో, పండుగ సీజన్కు సిద్ధమవుతున్న వినియోగదారుల్లో కొనుగోలు ఆసక్తి పెరుగుతోంది.
ముఖ్యంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో బంగారం, వెండిని కొనాలనుకునే వారు తమ నగరాల్లో తాజా ధరలను గమనించి నిర్ణయం తీసుకుంటున్నారు. సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్గా కొనాలా? లేక పండుగ షాపింగ్ కోసం తీసుకోవాలా.? అనే ఆలోచనలో ఉన్నవారికి ఈ ధరల మార్పు కొంత ఊరట కలిగిస్తోంది.
జనవరి 8న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత రోజుతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు సుమారు రూ.27 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,800గా కొనసాగుతోంది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,650గా ఉంది. ఈ ధరలు పండుగకు ముందు కొంతమంది కొనుగోలుదారులకు అనుకూలంగా మారినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు ఎక్కుతూనే రావడంతో కొనుగోలుకు వెనుకడుగు వేసిన వారు ఇప్పుడు మళ్లీ జువెలరీ షాపుల వైపు చూస్తున్నారు.
ఇక వెండి విషయానికి వస్తే, ఇటీవలి ర్యాలీకి బ్రేక్ పడినట్లుగా కనిపిస్తోంది. సరఫరా సమస్యలు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వెండి ధరలు పెరిగినప్పటికీ, గురువారం ఒక్కరోజే కేజీకి రూ.5,000 మేర తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి నగరాల్లో స్వచ్ఛమైన వెండి ధర కేజీకి రూ.2,72,000గా ఉంది. అంటే గ్రాము వెండి ధర రూ.272 వద్ద ట్రేడవుతోంది. ఈ తగ్గుదలతో వెండి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నవారు మార్కెట్ను నిశితంగా గమనిస్తున్నారు.

మొత్తానికి బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల రావడంతో సంక్రాంతి ముందు పండుగ షాపింగ్కు అనుకూల వాతావరణం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ధరలు మళ్లీ ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
Author: QAMAR SD

