• ఇచ్చోడ పీఎస్ లో ఫిర్యాదు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : భారత రాజ్యాంగం పై ఆదిలాబాద్ కు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తిపై అను చిత వ్యాఖ్యలు చేయడాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఇచ్చోడ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నదని అధ్యక్షులు రమేష్ నర్వాడే, కార్యదర్శి సొన్ కాంబ్లే కృష్ణ కుమార్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్తానిక సీఐ బండారి రాజు కూ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని కించపరచే విధంగా అనుచిత వాక్యాలు చేసిన ఓం ప్రకాష్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ధమ్మపాల్ గాయక్వాడ్, కృష్ణ సేంద్రీ, సంజీవ్ నర్వాడే, నాక్సెన్, సంజీవ్ కంబ్లె, గణేష్ గాయకంబ్లె, అర్జున్ భగత్ తదితరులు పాల్గొన్నారు.
