వాస్తవ నేస్తం, ఇచ్చోడ : ఇచ్చోడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్తానిక రైతు వేదిక భవ నంలో రైతులకు రాయితీ శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఆత్మ చైర్మన్ అశోక్, వ్యవసాయ అధికారిని తిరుమల కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భం గా వ్యవసాయ అధికారిని తిరుమల మాట్లాడారు. రబీ సీజన్ నేపథ్యంలో మండలానికి ఎన్బీఈజీ – 47 అనే రకం గల 261 రాయితీ శనగ విత్తనాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. 25 కేజీల శనగ బస్తా రూ 1500 ఉందన్నారు. కావలసిన రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో వ్యవ సాయ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Peanut Seeds : రాయితీ శనగ విత్తనాల పంపిణీ
0
178
Previous article
