📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessGold Rate Today | పసిడి ప్రియులకు మళ్ళీ గుడ్ న్యూస్.. అక్టోబర్ 31 బంగారం...

Gold Rate Today | పసిడి ప్రియులకు మళ్ళీ గుడ్ న్యూస్.. అక్టోబర్ 31 బంగారం ధరలు ఇవే.. 

పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్‌ అయ్యాయి. మరోవైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

అక్టోబర్ 31 వ తారీకు శుక్రవారం ధరలు ఒకసారి చూస్తే… 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,407 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,750 పలుకుతోంది. అదే సమయంలో ఒక కేజీ వెండి ధర రూ. 1,53,000 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా చెప్పవచ్చు. నిజానికి బంగారం ధరలు నిన్న అమెరికా ఫెడరల్ (America federal reserve interest) రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో పెరిగినప్పటికీ, డే ట్రేడింగ్ లో గమనించినట్లయితే తగ్గినట్లు చూడవచ్చు. అయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bank of America) ఇటీవల విడుదల చేసిన అంచనాలో పేర్కొంది. దీనికి తోడు అమెరికా చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యమైనది డాలర్ విలువ పెరగడం బంగారం ధర తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా మార్కెట్ లలో డిమాండ్ తగ్గడంతో పాటు, పసిడి ధరలు ఓవర్ బాట్ పొజిషన్ కు చేరుకోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే బంగారంలో వచ్చినటువంటి ఈ కరెక్షన్ భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉందా లేదా అనే అంశం పైన ఇన్వెస్టర్ లు తర్జనభర్జన పడుతున్నారు. నిజానికి డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయ వాణిజ్య సంబంధిత అంశాల్లో స్థిరత్వం నెలకొని ఉంటే బంగారం విలువ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్ లు బంగారాన్ని ఎక్కువగా సేఫ్ పెట్టుబడిగా చూడటం వలన పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్ లలో గమనించినట్లయితే బంగారం డిమాండ్ భారీగా తగ్గింది. గత దీపావళితో పోల్చి చూస్తే ఈ సంవత్సరం సేల్స్ భారీగా తగ్గినట్లు దుకాణదారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తగ్గివస్తున్న బంగారం ధరల కారణంగా మళ్లీ సేల్స్ పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గడం ప్రారంభించాయి. ఒక దశలో రెండు లక్షల రూపాయలకు ఒక కేజీ వరకు వెళ్లిన వెండి ధర ప్రస్తుతం 50 వేల రూపాయలు తగ్గింది. అయితే వెండి లో వచ్చినటువంటి ఈ కరెక్షన్ ఎంతవరకు వెళుతుంది అనేది వేచి చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page