వాస్తవ నేస్తం,జగిత్యాల : జిల్లాలోని కల్లెడ వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో సుద్దాల నరేష్ (30) అనే యువకుడు మృతి చెందాడు. బుగ్గారం మండలానికి చెందిన నరేష్, జగిత్యాల నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
