వాస్తవ నేస్తం, డెస్క్ హైదరాబాద్ : ప్రముఖ కవి, జయ జయహే తెలంగాణ జననీ జన కేతనం రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు గుండె పోటు వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్ర గేయ రచయిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కవులు కళాకారులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
