📄 ePaper
Saturday, March 14, 2026
📄 ePaper
HomeBusiness2030 నాటికి గ్రాము బంగారం ధర రూ.30,000? అంతర్జాతీయ నిపుణుల సంచలన అంచనాలు

2030 నాటికి గ్రాము బంగారం ధర రూ.30,000? అంతర్జాతీయ నిపుణుల సంచలన అంచనాలు

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: 2030 నాటికి గ్రాము బంగారం ధర ఏ స్థాయికి చేరుతుందన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు మరియు సెంట్రల్ బ్యాంకుల వ్యూహాత్మక నిర్ణయాలు బంగారం భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపుతున్నాయి. తాజా నిపుణుల అంచనాలు చూస్తే, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు ఇప్పటి స్థాయిలను మించి సంచలన రికార్డులు సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న ఒత్తిడి, వాణిజ్య యుద్ధాల ప్రభావం, అలాగే చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల 2025 నాటికే బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి. ఈ ధోరణి ఒక్కసారిగా ఆగిపోకుండా 2026 లో కూడా కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భద్రమైన పెట్టుబడిగా బంగారంపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.

యార్డెని రీసెర్చ్‌కు చెందిన ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు ఎడ్వర్డ్ యార్డెని చేసిన అంచనాలు ఇప్పుడు గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్సు బంగారం ధర సుమారు 4,428 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి అదే ధర 6,000 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 35 శాతం పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి :  Stock Split: కంపెనీ చరిత్రలో తొలిసారి – SKM Egg Products Export India Ltd బంపర్ ఆఫర్!

ఈ అంచనాలను భారతీయ మార్కెట్‌కు అన్వయిస్తే, 2026 చివరి నాటికి ఒక ఔన్సు బంగారం ధర సుమారు రూ.5.39 లక్షలకు చేరవచ్చని లెక్కలు చెబుతున్నాయి. అలా జరిగితే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఒక గ్రాము ధర దాదాపు రూ.19,000 వరకు చేరే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా చెప్పవచ్చు.

ఇక 2030 నాటికి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారనుంది. ఎడ్వర్డ్ యార్డెని అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఒక ఔన్సు బంగారం ధర 10,000 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.8.99 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన చూస్తే, 2030 నాటికి ఒక గ్రాము బంగారం ధర రూ.30,000 మార్కును తాకే అవకాశాన్ని నిపుణులు పూర్తిగా తోసిపుచ్చడం లేదు. అంటే ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రెండింతలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషణ చెబుతోంది.

బంగారంతో పాటు వెండిపైనా సానుకూల అంచనాలు వినిపిస్తున్నాయి. కమోడిటీ మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో వెండికి పెరుగుతున్న వినియోగం, మరోవైపు సరఫరా పరిమితంగా ఉండటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

Gold price prediction 2030 India one gram gold rate forecast
Gold price prediction for 2030 sparks investor interest amid global uncertainty

మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య దీర్ఘకాల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని, తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో కనీసం 20 శాతం వరకు బంగారం మరియు వెండికి కేటాయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, విలువైన లోహాలు రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులకు భద్రమైన ఆప్షన్‌గా కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి :  Gold, Silver Rates Jan 1: వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఇన్వెస్టర్లకు ఊరట

Author: Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page