• గ్రామ అభివృద్ధికి సహకరించాలని వినతి
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఇటీవలే నూతనంగా ఎన్నికైన ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జలై జాకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వాజిద్, సజీద్, ఆసిఫ్, గోరు, తదితరులు ఉన్నారు.
