వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు వంటి ప్రధాన పండుగల వేళ భారత మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకడం సామాన్య కొనుగోలుదారుల్లో ఆందోళనను పెంచుతోంది. పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయంలో భాగం కావడంతో, ధరల పెరుగుదల నేరుగా కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా ఊహించని స్థాయిలో కదలాడటంతో మార్కెట్లో చర్చ జోరందుకుంది.
భారతదేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరుగుదల నమోదు చేశాయి. జనవరి 11వ తేదీ ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.24,700 మేర పెరిగింది. అదే సమయంలో 10 గ్రాములపై రూ.2,470 పెరుగుదల కనిపించింది. ఈ తాజా పెరుగుదలతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయుల దిశగా కదులుతున్నాయి. జనవరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు దాదాపు నాలుగు శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుత ధరల వివరాలను చూస్తే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,40,470కు చేరింది. 100 గ్రాముల ధర రూ.14,04,600గా నమోదైంది. గ్రాము ధర రూ.14,046గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,28,750గా, 100 గ్రాములకు రూ.12,87,500గా ట్రేడవుతోంది. గ్రాము ధర రూ.12,875గా ఉండగా, ఇది గత రోజుతో పోలిస్తే రూ.115 పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. 10 గ్రాములకు రూ.1,05,340గా, 100 గ్రాములకు రూ.10,53,400గా నమోదైంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా తిరిగి బలంగా పుంజుకున్నాయి. జనవరి 8, 9 తేదీల మధ్య వెండి ధరలు రూ.8 వేల వరకు పడిపోయినా, జనవరి 11న ఒక్కరోజే రూ.11 వేల పెరిగి కిలో వెండి ధర రూ.2.60 లక్షలకు చేరింది. 100 గ్రాముల వెండి ధర రూ.2,600గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.26,000గా నమోదైంది. జనవరి నెలలో ఇప్పటి వరకు వెండి ధరలు తొమ్మిది శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా బంగారం ధరలపై నిపుణుల అంచనాలు మార్కెట్లో ఆసక్తిని రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయా లేదా తగ్గుతాయా అన్న ప్రశ్నకు మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. కోటక్ సెక్యూరిటీస్కు చెందిన కమోడిటీ రీసెర్చ్ నిపుణుడు కైనత్ చైన్వాలా మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించే అవకాశం మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నదని తెలిపారు. ఈ సుంకాలు అమలులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి, బంగారం మరియు వెండి వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ బలపడే అవకాశం ఉందన్నారు.

అయితే ఈ అంశం ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. కోర్టు ఈ సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, బంగారం ధరల పెరుగుదల కొంత మేరకు పరిమితం కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ పండుగల డిమాండ్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, వడ్డీ రేట్లపై అంచనాలు కలిసి రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలను మరింత అస్తిరంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Author: Qamar SD
