వెండి ధరలు ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. కేవలం బంగారం కాదని, పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు చేసిన వెండి, రాబోయే 2026లో కొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దేశీయ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ SAMCO సెక్యూరిటీస్ తాజా విశ్లేషణ ప్రకారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా కిలో రూ.3.94–4 లక్షల మర్క్ ని తాకే అవకాశం ఉంది.
2025లో ఇప్పటికే వెండి పెట్టుబడిదారులు లాభాల పరుగు దూకిన నేపథ్యంలో, ఈ అంచనాలు ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో సంచలనాన్ని రేపుతున్నాయి. SAMCO సెక్యూరిటీస్ తెలిపిన వివరాలు ఏకకాలంలో వెండి డిమాండ్, సరఫరా, గ్లోబల్ ఆర్థిక పరిణామాలు వంటి అంశాలను మిళితం చేస్తూ రాబోయే ధరలపై ధైర్యమైన అంచనాలను ప్రతిపాదిస్తున్నాయి.
వెండి ధరల పెరుగుదలకు కారణాలు :
1. సరఫరా కొరత: ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో, బృహత్తర డిమాండ్ను తీరుస్తుంది. ముఖ్యంగా మెక్సికో, పెరూ, చైనా వంటి దేశాల్లో గనుల వెలికితీత తగ్గడం ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది.
2. పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల: గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిశ్రమల పెరుగుదల వెండిని హాట్ కమోడిటీగా మార్చింది.
3. కమోడిటీ సూపర్సైకిల్ ప్రభావం: ప్రపంచ మార్కెట్లలో ప్రస్తుతం కమోడిటీ సూపర్సైకిల్ నడుస్తోంది. దీని వలన లోహాల ధరలు సహజంగానే పెరుగుతున్నాయి. వెండి కూడా ఈ లాభాల్లో భాగస్వామి అవుతోంది.
4. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావం: గ్లోబల్ ఇన్ఫ్లేషన్ డేటా, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ నిర్ణయాలు వెండిని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి. పెట్టుబడిదారులు దీన్ని ఒక భరోసాగా భావించి కొనుగోలు చేస్తున్నారు.
పెట్టుబడిదారులకు పండగే
2025లో వెండి పెట్టుబడిలో ఉన్న వారికి ఇప్పటికే పెద్ద లాభాలు దక్కాయి. SAMCO సెక్యూరిటీస్ అంచనాలు నిజమైతే, 2026లో కూడా వెండి పెట్టుబడులు అదే రీతిలో పండగగా మారబోతున్నాయి. ఇది గమనించదగిన విషయం ఏమిటంటే, బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, వెండి అంతకంటే వేగంగా పెట్టుబడిదారుల సంపదను పెంచుతోంది. ఒకప్పుడు సామాన్యుడి బంగారంలా పిలువబడిన వెండి ఇప్పుడు పెట్టుబడి ప్రపంచంలో మెగా స్టార్లా దూసుకుపోతోంది.

SAMCO విశ్లేషణ ప్రకారం, రాబోయే రెండు సంవత్సరాల్లో కిలో వెండి ధర సామాన్యులకు సాధ్యంకానివరకు ఎక్కవ మైలురాయిని తాకే అవకాశం ఉంది. ఈ విధంగా వెండి పెట్టుబడులు కేవలం ధన సంపాదన మాత్రమే కాక, భవిష్యత్ ఆర్థిక భరోసా సాధనంగా కూడా మారాయి.
ఇది ఖచ్చితంగా గమనించదగ్గ విషయం: డిమాండ్ పెరుగుదల, సరఫరా కొరత, గ్లోబల్ ఆర్థిక పరిణామాలు కలిసి వెండి ధరలపై ప్రతికూల ప్రభావం చూపకుండా, ఎప్పటికీ పెరుగుదల వైపే దారితీస్తున్నాయి. పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సమయానికి గుర్తించి, స్ట్రాటజిక్ పెట్టుబడులు ఏర్పాటు చేస్తే, రాబోయే సంవత్సరాల్లో వారి సంపద వృద్ధి మరింత వేగవంతమవుతుంది.
Author: Qamar SD, Vaasthava Nestham
