📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadఇకపై నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదు : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఇకపై నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదు : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విద్య, ఉద్యోగ, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందడం కోసం నివాసం, ఆదాయం, EWS, EBC, OBC, కుటుంబ సభ్యుల ధ్రువపత్రం, జననం, మరణం లేట్ రిజిస్ట్రేషన్ మొదలగు పత్రాలు పొందడానికి ఇకపై నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటరైజ్డ్ అఫిడవిట్ సమర్పించడంతో పేద ప్రజలకు అదనము వ్యయం, సమయం వృధా అవుతుందని జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో ఇకపై అలాంటి అఫిడవిట్‌లు లేదా గజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ సమర్పించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. ఇవి లేని పక్షంలో సెల్ఫ్ అఫిడవిట్ జతపరిచినచో తహసీల్దార్‌లు సర్టిఫికేట్‌లను త్వరితగతిన ధృవీకరించి జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సడలింపును దుర్వినియోగం చేసి తప్పుడు పత్రాలు సమర్పించే వారిపై సంబంధిత సర్టిఫికేట్ రద్దు చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరింత సమాచారం కొరకు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫోన్: 9989201470 ను సంప్రదించాలని సూచించారు. ఈ మినహాయింపు కుల ధ్రువీకరణ పత్రాలకు వర్తించదని, ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page