📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
HomeCrime NewsParrots: గుండెలు పగిలే దృశ్యం.. విషపూరిత గింజలు తిని 200 చిలుకలు మృతి

Parrots: గుండెలు పగిలే దృశ్యం.. విషపూరిత గింజలు తిని 200 చిలుకలు మృతి

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది తీరంలో జరిగిన ఘటన పక్షి ప్రేమికుల హృదయాలను కలచివేసింది. చూడ ముచ్చటైన చిలుకలు ఒక్కసారిగా విగతజీవులుగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 200కు పైగా చిలుకలు విషపూరిత ఆహారం కారణంగా ప్రాణాలు కోల్పోయాయి. ఈ దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది.

విషపూరిత ఆహారమే కారణం | Poisonous Food Confirmed

మొదట బర్డ్ ఫ్లూ అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. చిలుకల మరణానికి బర్డ్ ఫ్లూ కాదు, విషం కలిసిన ఆహారమే కారణమని స్పష్టమైంది. పర్యాటకులు లేదా స్థానికులు వేసిన కలుషిత అన్నం లేదా విషపూరిత గింజలు తినడం వల్లే ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

నర్మదా తీరంలో హృదయ విదారక దృశ్యం | Heartbreaking Scene Near Narmada

గత నాలుగు రోజులుగా బద్వా ప్రాంతంలోని కాలువ వంతెన సమీపంలో పెద్ద సంఖ్యలో పక్షుల మృతదేహాలు కనిపించాయి. చిలుకలతో పాటు పావురాలు కూడా ఈ విషపూరిత ఆహారం తిని మృతి చెందినట్లు గుర్తించారు. పెద్ద సంఖ్యలో చిలుకలు ఇలా చనిపోవడం స్థానికులను, పక్షి ప్రేమికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

రెస్క్యూ ప్రయత్నాలు విఫలం | Rescue Efforts Failed

సమాచారం అందుకున్న వెంటనే అటవీ, పశువైద్య శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని చిలుకలు ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వాటిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే విష ప్రభావం ఎక్కువగా ఉండటంతో అవి కొద్ది సేపట్లోనే మృతి చెందినట్లు జిల్లా వన్యప్రాణి వార్డెన్ టోనీ శర్మ తెలిపారు.

ఇది కూడా చదవండి :  Operation kaghar | మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మా లొంగిపోతాడా..?

పోస్టుమార్టంలో షాకింగ్ నిజాలు | Shocking Postmortem Findings

పోస్టుమార్టం నిర్వహించిన పశువైద్యురాలు డాక్టర్ మనీషా చౌహాన్ మాట్లాడుతూ, చిలుకల్లో బర్డ్ ఫ్లూకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఆహార విషప్రయోగానికి సంబంధించిన లక్షణాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు. మరణించిన పక్షుల కడుపులో బియ్యం, చిన్న గులకరాళ్లు లభించాయని పశువైద్య విస్తరణ అధికారి డాక్టర్ సురేష్ బఘేల్ వెల్లడించారు.

పక్షులకు ఆహారం వేయడంపై నిషేధం | Feeding Birds Banned

ఈ ఘటన తర్వాత అటవీ శాఖ అధికారులు వంతెన సమీపంలో పక్షులకు ఆహారం వేయడాన్ని పూర్తిగా నిషేధించారు. అక్కడ ఎవరూ ఆహారం వేయకుండా సిబ్బందిని నియమించారు. పక్షుల అంతర్గత అవయవాల నమూనాలను తదుపరి పరీక్షల కోసం జబల్‌పూర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

మన నిర్లక్ష్యమే మూగ ప్రాణాల మృతి | Human Negligence Costs Lives

వండిన ఆహారం, మిగిలిపోయిన అన్నం లేదా పురుగుమందులు పిచికారీ చేసిన పంటల నుంచి వచ్చిన గింజలు పక్షుల జీర్ణ వ్యవస్థకు ప్రాణాంతకంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి ఉద్దేశంతో ఆహారం వేస్తున్నామనుకునే మనుషుల నిర్లక్ష్యమే ఈ మూగజీవుల ప్రాణాలను హరించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పక్షులకు ఆహారం ఇవ్వాలంటే సరైన అవగాహన, జాగ్రత్తలు ఎంతో అవసరమని వారు సూచిస్తున్నారు.

– Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page