వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరటనిచ్చేలా వెండి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గత నెల రోజులుగా విపరీతంగా పెరిగిన సిల్వర్ రేట్లు తాజాగా బ్రేక్ తీసుకుని దిగివచ్చాయి. దీంతో పండుగ షాపింగ్కు ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి.
అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, సరఫరా సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా మార్కెట్లో వచ్చిన మార్పుతో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. జనవరి 9, 2025న వెండి ధర కేజీకి రూ.3,000 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలుదారుల దృష్టి మళ్లీ వెండి వైపు మళ్లింది.
హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ప్రస్తుతం కేజీ స్వచ్ఛమైన వెండి ధర రూ.2,68,000గా కొనసాగుతోంది. అదే విధంగా గ్రాము వెండి ధర రూ.268 వద్ద స్థిరంగా ఉంది.
మరోవైపు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. జనవరి 8తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.71 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.13,871గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,715గా కొనసాగుతోంది.
భారతీయులకు బంగారం, వెండి అంటే కేవలం లోహాలు మాత్రమే కాదు, సంప్రదాయం మరియు భావోద్వేగం కూడా. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగ ల సమయంలో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. అందుకే కొనుగోలు చేయాలనుకునేవారు తమ నగరాల్లో రోజువారీగా మారుతున్న ధరలను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

వెండి ధరలో వచ్చిన ఈ అకస్మాత్తు తగ్గుదల ఎంతకాలం కొనసాగుతుందన్నది చూడాల్సి ఉన్నప్పటికీ, పండుగకు ముందు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్న వారికి ఇది సరైన సమయమే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Author: Qamar SD
