వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: నిన్నటి వరకు భారీగా దిగివచ్చిన బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గురువారం మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 2,600లకు పైగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,300లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,650గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. దాదాపు 3 వేలుకు పైగానే పెరిగింది. కిలో వెండి ధర 1,59,500గా ఉంది.
